కేసీఆర్ పచ్చి అబద్దాలు ఆడుతుండు

కేసీఆర్ పచ్చి అబద్దాలు ఆడుతుండు

సీఎం కేసీఆర్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మల్కాజ్ గిరిలో పార్టీ డిజిటల్ మెంబర్  కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో కేవలం 80వేల ఉద్యోగాలు మాత్రమే ఖాళీ ఉన్నాయని చెప్పడం పచ్చి అబద్దమని మండిపడ్డారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ఇవాళే నోటిఫికేషన్ ఇచ్చేవారని అన్నారు. 2014లో లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కేసీఆర్ ప్రకటనను గుర్తు చేసిన రేవంత్ రెడ్డి..మిగిలిన ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బిస్వాల్ కమిటీ సైతం 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని నివేదిక ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఉద్యోగాలు అడగటం కాదు.. కేసీఆర్ ఉద్యోగం పీకేయాలని అన్నారు. ముఖ్యమంత్రి ఉద్యోగం ఊడే పరిస్థితి వచ్చినందునే ఉద్యోగాల ప్రకటన చేశారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు 2లక్షల నోటిఫికేషన్లు ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.