పంట ఎందుకు కొనవ్.. నీ అయ్య జాగీరా.!

పంట ఎందుకు కొనవ్.. నీ అయ్య జాగీరా.!

సీఎం కేసీఆర్ గద్దెనెక్కిన తర్వాత పదమూడున్నర లక్షల కోట్లు ఖర్చు చేసినా..గ్రామాల్లో సరిగా రోడ్లు లేవన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. నాల్గోరోజు పాదయాత్రలో మాట్లాడిన రేవంత్.. కొండారెడ్డి పల్లి నుండి తిమ్మరాసిపల్లి మీదుగా కల్వకుర్తికి టూవీలర్ పై వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. అవసరమైతే దేవుడితో కొట్లాడుతా అన్న కేసీఆర్.. మోడీ తెస్తున్న చట్టాలపై ఎందుకు మాట్లాడట్లేదన్నారు. ‘వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పంట కోనబోమంటున్నారు..నీ అయ్యా జాగీరా పంట ఎందుకు కొనరని  ప్రశ్నించారు‘ రేవంత్. రాజశేఖర్ రెడ్డి బాటలోనే రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టారన్నారు మాజీ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి. కల్వకుర్తి రైతుల బాధలు చెబుతున్నారన్నారు. తిమ్మరాసి పల్లిలో పూర్తిగా రైతులే ఉన్నారని.. రైతు సమస్యలు పోయే వరకు రైతు పోరాటాలు కొనసాగుతాయన్నారు.

భారత్ లో 500 అకౌంట్స్ ను నిలిపివేసిన ట్విట్టర్