ఈనెల 26 నుండి పాదయాత్ర చేస్తా:రేవంత్ రెడ్డి

 ఈనెల 26 నుండి పాదయాత్ర చేస్తా:రేవంత్ రెడ్డి

తెలంగాణలో టీపీసీసీ చీఫ్ రేవంత్  రెడ్డి పాదయాత్రకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఈనెల 26 నుండి పాదయాత్ర చేస్తామని చెప్పారు. పాదయాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించాలనే దానిపై మూడు ప్రాంతాలు .  పరిశీలనలో వున్నాయని తెలిపారు. భద్రాచలం, జోడేఘడ్, జోగులాంబ వీటిలో ఏదోఒకటి ప్లేస్ ఫైనల్ అవుతుందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ ఛార్జీ వచ్చిన తర్వాత ఫైనల్ చేస్తామని స్పష్టం చేశారు. రోజుకు 19 కిలోమీటర్లు, 126 రోజులు యాత్ర ఉంటదని తెలిపారు. అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు,నేతలు అందరూ సమన్వయంతో పనిచేయాలని  మీడియా చిట్ చాట్ లో పేర్కొన్నారు. 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ  చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ఈ యాత్ర చేయనున్నారు. త్వరలోనే యాత్రకు సంబంధించిన రూట్‌మ్యాప్‌ను తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించనుందని చెప్పారు. ఇటీవల మల్లిఖార్జున ఖర్గేతో జరిగిన భేటీలోనూ పాదయాత్రకు సంబంధించి రేవంత్ చర్చించినట్లు సమాచారం. అందుకు ఖర్గే కూడా సుముఖత వ్యక్తం చేశారని రేవంత్ వర్గం నాయకులు చెబుతున్నారు.