భద్రాద్రికొత్తగూడెం: ఒక్క ఓటు మిస్ కాకుండా చూసే బాధ్యత కార్యకర్తలదే

భద్రాద్రికొత్తగూడెం: ఒక్క ఓటు మిస్ కాకుండా చూసే బాధ్యత కార్యకర్తలదే

భద్రాద్రికొత్తగూడెం/ మరిపెడ, వెలుగు : ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సర్​పై అలర్ట్​గా ఉండాలని, ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చూడాల్సిన బాధ్యత నేతలు, కార్యకర్తలదేనని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, ప్రభుత్వ విప్, డోర్నకల్​జాటోత్​రామచంద్రునాయక్ ​అన్నారు. 

బుధవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెం, మహబూబాబాద్​ జిల్లా మరిపెడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్​ రివిజన్​(సర్​)పై బూత్​ లెవల్ కమిటీ మెంబర్లకు ట్రైనింగ్​ ప్రోగ్రాం నిర్వహించారు. కొత్తగూడెంలో ఎంపీ, మరిపెడలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ సానుభూతి పరుల ఓట్లను తొలగించేందుకు చేస్తున్న కుట్రలపై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పార్టీకి బూత్​ లెవెల్​ కార్యకర్తలే కీలకమన్నారు.