తెలంగాణ ప్రజలు కష్టాల తీర్చేందుకు సోనియమ్మ మళ్లీ వచ్చింది:రేవంత్రెడ్డి

తెలంగాణ ప్రజలు కష్టాల తీర్చేందుకు సోనియమ్మ మళ్లీ వచ్చింది:రేవంత్రెడ్డి

తుక్కుగూడ కాంగ్రెస్ విజయభేరి సభ సక్సెస్ అయింది.. రాష్ట్రం నలు మూలల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞత గా సభలో లేచి నిల్చొని అభివాదం చేశారు.

గత తొమ్మిదేళ్లుగా కేసీఆర్ పాలనలో రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు అడుక్కుతినే పరిస్థితి వచ్చిందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు తీర్చేందుకే మరోసారి సోనియా గాంధీ ఈ గడ్డపై అడుగు పెట్టిందని రేవంత్ రెడ్డి అన్నారు. 

2004లో కరీంనగర్ సభ సాక్షిగా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు హామీ ఇచ్చిందని.. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న మహానేత సోనియా గాంధీ అని..కృతజ్ఞత గా తెలంగాణ ప్రజలు లేచి నిలబడి ఘనంగా స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు తెలిపారు రేవంత్ రెడ్డి. 

 ఫాంహౌస్ లో ఉన్న కేసీఆర్ గుండెలదిరేలా తుక్కుగూడ విజయ భేరి మోగిందని.. సభ సక్సెస్ కావడం సంతోషంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి. మొదట సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో సభ పెట్టాలని అనుకుంటే.. బీజేపీ కుట్ర చేసి సభకు అనుమతి ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.  ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తుక్కు గూడ సభ విజయవంతం అయిందని రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.