గాంధీకి వెళ్లిన కేసీఆర్ కు రేవంత్ డిమాండ్లు ఇవే..

గాంధీకి వెళ్లిన కేసీఆర్ కు రేవంత్ డిమాండ్లు ఇవే..

గాంధీ హాస్పిటల్ కు వెళ్లిన సీఎం కేసీఆర్... కరోనా డ్యూటీలు చేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగుల జీతాలు 8 వేల నుంచి 16 వేలకు పెంచాలన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. డాక్టర్లు, ఇతర సిబ్బందికి గతంలో ఇస్తానన్న 10 శాతం ఇన్సెంటివ్ ను ఇంత వరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అవి ఎప్పటి వరకు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్. జూడాలతో ఆసుపత్రి వేదికగా చర్చలు జరిపి అక్కడికక్కడే వారి సమస్యలు పరిష్కరించాలన్నారు.  గాంధీలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యల పై టైం టార్గెట్ పెట్టుకుని పరిష్కరించాలని సూచించారు. కరోనాతో చనిపోయిన రోగుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు రేవంత్. గతంలో ఉస్మానియాకు వెళ్లిన టైమ్ లో ఇచ్చిన హామీలను సీఎం ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. ఇవాల్టి గాంధీ పర్యటన మరో ఉస్మానియూ టూర్ లా కాకూడదని ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి.