టీఆర్ఎస్ నేతల కబ్జాలు.. కేటీఆర్కు రేవంత్ లేఖ

టీఆర్ఎస్ నేతల కబ్జాలు.. కేటీఆర్కు రేవంత్ లేఖ

మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి లేఖలో తెలిపారు. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ భూములు, చెరువులు కజ్బా చేసి అక్రమ కట్టడాలు కడుతున్నారని, టీఆర్ఎస్ నాయకుల అక్రమాలపై మీరు పట్టించుకోవడం లేదని  లేఖలో ఆరోపించారు. అక్రమార్కులపై ఉక్కు పాదం అంటూ అప్పుడప్పుడు అధికారుల హంగామా తప్ప చర్యలు లేవని, టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న అక్రమాలను మీరు ఎందుకు అడ్డుకోవడం లేదు.
మీకు చేతకాకనా.. లేక అందులో మీకు వాటాలు ఉన్నాయా.. ?అని ఆయన ప్రశ్నించారు.

జవహర్ నగర్ లో 488 సర్వే నెంబర్ లో మంత్రి మల్లారెడ్డి బంధువులు అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా చేసి అక్కడ ఆసుపత్రి కూడా నిర్మించి మరో మంత్రి చేత ప్రారంభం చేశారు.. ఇది అంత ఆషామాషీ విషయమా ? అని రేవంత్ లేఖ ద్వారా మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించారు. ఫీర్జాది గూడ లో మీ నాయకులు ప్రభుత్వ స్థలం ఆక్రమించి ఫంక్షన్ హాల్ నిర్మించారన్నారు.దేవర యాంజల్ 437 సర్వే నెంబర్ లో మీ కుటుంబమే దేవాలయ భూమిని ఆక్రమించి నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే పత్రికలు నడుపుతున్నారు..ఇలాంటి గ్రేటర్ లో మీ నాయకులు చేసిన కబ్జాలు కోకొల్లలు. అనేక అక్రమాలకు సంబంధించి పత్రికలలో హెడ్ లైన్స్ గా వచ్చాయి. ఈ విషయాలు మీరు మునిసిపల్ శాఖ మంత్రిగా స్పందించి చర్యలు తీసుకొని అక్రమ నిర్మాణాలను కూల్చివేయించాలి...మీరు చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ పక్షాన మేమే ప్రత్యక్ష కార్యాచరణ కు దిగుతామని రేవంత్ రెడ్డి లేఖలో తెలిపారు.

మరిన్ని వార్తల కోసం..

ఆధార్ తప్పనిసరి కాదు.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం