42 ఎకరాల ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు..నేలమట్టం చేసిన రెవెన్యూ అధికారులు

42 ఎకరాల ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు..నేలమట్టం చేసిన రెవెన్యూ అధికారులు

 గ్రేటర్ హైదరాబాద్ లో ఓ వైపు హైడ్రా,మరో వైపు రెవెన్యూ,జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపిస్తున్నారు.  ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు రెవెన్యూ అధికారులు. కొన్ని చోట్ల పర్మిషన్ లేకుండా ఇష్టారాజ్యంగా భవనాలు,బిల్డింగ్ లు కడుతున్నారు.    జూన్ 14న మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో  ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను  కూల్చివేశారు రెవెన్యూ అధికారులు .

ALSO READ | నాలాల పూడికతీత స్పీడప్ చేయాలి: హైడ్రా క‌‌‌‌మిష‌‌‌‌న‌‌‌‌ర్‌‌‌‌ రంగనాథ్

 షాబాద్ మండల  పరిధిలో హైతాబాద్ గ్రామం రెవెన్యూలోని సర్వే నెంబర్ 8 లో  42 ఎకరాల ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను తొలగించారు  షాబాద్ ఎమ్మార్వో, అధికారులు.  ఇష్టానుసారంగా హైతాబాద్ లో ఉన్నటువంటి బడా నాయకులు డబ్బుల కోసం వేరే వ్యక్తులకు షాపులు వేసుకొని నెలసరి మామూలు ఇవ్వాలని డిమాండ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.  ఈ విషయం అధికారులకు తెలియడంతో అధికారులు ప్రభుత్వ భూములలో అక్రమ కట్టడాలను జేసీబీ సాయంతో తొలగించారు. ఇలాంటివి జరగకుండా అక్రమ నిర్మాణాలను అరికట్టాలని గ్రామస్తులు ప్రభుత్వ అధికారులను  కోరారు.

నాలాలు ఆక్రమించి, ప్రభుత్వ స్థలాల్లో  అక్రమంగా వెలిసిన నిర్మాణాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి జీహెచ్ఎంసీ, రెవెన్యూ, హైడ్రా వీటిపైనే ఫోకస్ పెట్టింది. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది.