శ్రీశైలం పవర్ ప్లాంట్ లో ప్రమాదంపై సీబీఐతో పాటు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ( CEA )తో విచారణకు అదేశించాలన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్. ప్రమాదంపై ప్రధాని మోడీకి లేఖ రాసిన రేవంత్ పవర్ ప్లాంట్ ఘటనలో క్రిమినల్ కోణం ఉందన్నారు. వందల కోట్ల నష్టం వాటిల్లింద్నారు. పవర్ ప్లాంట్ లో ప్రమాదం జరగడం వల్ల కొందరికి లాభం జరుగుతుందన్నారు. సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు వస్తాయన్నారు. అనుభవం లేని రిటైర్డ్ అయిన ప్రభాకర్ రావును ఎండీగా ఉండడం వల్ల జెన్కో ట్రాన్స్కో సంస్థలు నష్టాల్లో కూరుకపోయాయన్నారు. ప్రభాకర్ హయాంలో ఇచ్చిన టెండర్లు, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరపాలన్నారు. పవర్ ప్లాంట్ లో ప్రమాదం వల్ల బయట ప్రైవేట్ వ్యక్తులకు లాభం జరుగుతుందన్నారు. బయట ఎవరిదగ్గర నుంచి విద్యుత్ కొంటున్నారో ప్రజలకు చెప్పాలన్నారు.
see more news
తెలంగాణలో కొత్తగా 1873 కేసులు..9 మంది మృతి