చిరంజీవిపై వర్మ షాకింగ్ కామెంట్స్

చిరంజీవిపై వర్మ షాకింగ్ కామెంట్స్

తన దృష్టిలో చిరంజీవి ఒక ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కాదని.. తెలుగు రాష్ట్రాల ప్రజలకి బాగా కావాల్సిన వ్యక్తి అని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. ఆయన తెరకెక్కించిన అడవి మూవీ మళ్లీ అక్టోబర్14న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్టీవీ మాట్లాడుతూ.. ఓల్డ్ హిట్ మూవీస్ మళ్ళీ రిలీజ్ చేస్తానని ప్రకటించాడు. కాగా, కొద్దిరోజుల క్రితం చోటు చేసుకున్న గరికపాటి–చిరు వివాదంపై స్పందించారు. 'గరికపాటి ఒరిజినల్ పేరు తెలీదు... అందుకే అలా ట్విట్టర్ లో పోస్ట్ చేశాను. ప్రవచనాలు చెప్పుకునే వ్యక్తి... ఫొటోస్ తీసుకునే వాళ్ళని అనాలి గాని చిరంజీవిని కాదు' అని తెలిపాడు

ఇక గాడ్ ఫాదర్ మూవీ చూశారా.. అని మీడియా అడిగిన ప్రశ్నకు వర్మ తన స్టైల్ లో సమాధానం ఇచ్చారు. 'గాడ్ ఫాదర్ ఇంకా చూడలేదు.. నేను చిరంజీవికి వీరాభిమానిని కానీ ఆయన సినిమాలకి కాదు' అన్నారు. ఇక కేసీఆర్ బయోపిక్ ఎప్పుడు వస్తుందని అడగ్గా.. దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. భవిష్యత్ లో చేస్తానేమో అని స్పష్టం వర్మ చేశాడు.