ఆర్జీవీ, నట్టి కుమార్ ఒక్కటయ్యారు

ఆర్జీవీ, నట్టి కుమార్ ఒక్కటయ్యారు

తమ ఇద్దరి మధ్య కొన్ని నెలలుగా కొనసాగుతున్న విబేధాలకు ఫుల్ స్టాప్ పెడుతూ... తామిద్దరం కలిసిపోయామని ఆర్జీవీ, నట్టి కుమార్ ప్రకటించారు. తాము కలిసిపోవడం కొంతమందికి బాధనిపించవచ్చని అన్నారు. ఈ మేరకు ఇద్దరు కలిసి ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇప్పటి నుంచి తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం చేశారు. కొంత మంది వ్యక్తులు తమ మధ్య గ్యాప్ ను క్రియేట్ చేశారని, ఇప్పటి నుంచి కలిసి పని చేస్తామని నట్టి కుమార్ తెలిపాడు. తాను నట్టి చెప్పినంత మంచి వాణ్ని కాదని, నట్టి తాను అన్నట్లు అంత బ్యాడ్ కాదని, తమ విషయంలో అందరూ నవ్వి ఆనందించాలని వర్మ అన్నారు. స్నేహమేరా జీవితం... స్నేహమేరా శాశ్వతం అంటూ ఫైనల్ గా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. 

గత కొన్ని రోజుల నుంచి ఆర్జీవీ, నట్టి కుమార్ మధ్య ఫైనాన్షియల్ గొడవలు కొనసాగిన విషయం తెలిసిందే. తన సినిమాలకు డబ్బులు సాయం చేస్తే... తిరిగి ఇవ్వకుండా తమపై ఆర్జీవీ కేసు పెట్టాడని నట్టి కుమార్ ఆరోపించాడు. తన డబ్బు తిరిగి ఇవ్వకపోతే వర్మ సంగతి చూస్తా అంటూ నట్టి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయితే నట్టి కుమారులు నట్టి క్రాంతి, నట్టి కరుణ ఫోర్జరీ పత్రాలతో తనపై కోర్టులో కేసు వేశారని... దీనిపై చర్యలు తీసుకోవాలని ఆర్జీవీ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఇలా ఈ వివాదం కొనసాగుతున్న వేళ వర్మ, నట్టి కుమార్ కలిసిపోయినట్లు  ఓ వీడియో రిలీజ్ చేశారు.