చంద్రాయణగుట్టలో రిగ్గింగ్ జరిగిందా?

చంద్రాయణగుట్టలో రిగ్గింగ్  జరిగిందా?

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీలోని చంద్రాయణగుట్టలో రిగ్గింగ్ జరిగినట్లు తెలిసింది. సాయంత్రం పోలింగ్ ముగిసే ముందు ఒకేసారి కొంత మంది వ్యక్తులు పోలింగ్ బూత్‌లోకి దూసుకెళ్లి రిగ్గింగ్ చేస్తున్నట్లు స్వయంగా అధికారులు గుర్తించినట్లు తెలిసింది. సీఈఓ వికాస్ రాజ్, జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్‌ వెబ్ కాస్టింగ్ ద్వారా రిగ్గింగ్ జరుగుతున్నట్లు గుర్తించి, పోలింగ్ సెంటర్ ప్రిసైడింగ్ ఆఫీసర్‌‌పై ఫైర్ అయినట్లు సమాచారం.

ఎంఐఎం పార్టీ చెందిన ఓ లీడర్ దగ్గరుండి రిగ్గింగ్ చేయిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిసింది. ఈ ఘటనపై అక్కడి అధికారులపై చర్యలు తీసుకుంటారా? లేక పోలీసులకు ఫిర్యాదు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. రిగ్గింగ్ జరిగింది నిజమైతే అక్కడ రీ పోల్ నిర్వహించాల్సి ఉంటుంది. మరోవైపు, నాంపల్లి నియోజకవర్గంలో పోలింగ్ సరళిని డ్రోన్ల ద్వారా పరిశీలించారు.