డబ్బున్నోళ్లు బాస్ : 4 గంటల రిహన్న షోకు రూ.75 కోట్లు ఇస్తున్న అంబానీ

డబ్బున్నోళ్లు బాస్ : 4 గంటల రిహన్న షోకు రూ.75 కోట్లు ఇస్తున్న అంబానీ

ముఖేష్ అంబానీ.. ఈ పేరు వింటే గుర్తొచ్చేది డబ్బు.. లక్షల కోట్ల డబ్బు.. ప్రపంచంలోనే ధనవంతుడు అనే ట్యాగ్ లైన్స్.. అలాంటి ఇంట్లో పెళ్లంటే.. ఆడంబరం ఎంత ఉంటుంది ఊహకే అందదు కదా.. కొద్దో గొప్పో డబ్బున్నోళ్లు పెళ్లి చేస్తేనే లక్షలకు లక్షలు ఖర్చు చేస్తున్నారు.. అలాంటిది అంబానీ ఇంట్లో పెళ్లి.. సారీ సారీ.. ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ అంటే ఎలా ఉంటుందో తెలుసా.. మిగతావి ఎలా ఉన్నా.. ఈ చిన్న స్టోరీ ఒక్కటి చాలు.. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు అనటానికి..

రిహన్న.. పాప్ సింగర్.. ప్రపంచ పాపు సింగర్లలో ఒకరు.. ఈ రిహన్న ఇప్పుడు జాంనగర్ వచ్చారు.. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో స్పెషల్ షో వేస్తున్నారు. నాలుగు గంటలపాటు తన సంగీతంతో.. తన పాటలతో అతిరథ మహారథులను తన్మయత్వంలో ముంచెత్తనున్నారు.. ప్రపంచ పాప్ సింగర్ కు ఎంత ఫీజు ఇస్తున్నారో తెలుసా.. అక్షరాల 75 కోట్ల రూపాయలు అంట. 

అవును.. నాలుగు గంటలు పాటలు పాడేందుకు.. ముఖేష్ అంబానీ దగ్గర రిహన్న తీసుకుంటున్న ఫీజు అంట.. 75 కోట్ల రూపాయలు ఫీజు మాత్రమే.. ఆమె విదేశాల నుంచి జాంనగర్ రావటానికి ప్రత్యేక విమానం.. ఆ విమానంలో మూడు ట్రక్కుల్లో వచ్చిన ఎక్విప్ మెంట్.. మూడు రోజులు జాంనగర్ లో రిహన్న టీం విడిది.. ఇలా మరో 10 కోట్ల రూపాయలు.. టోటల్ గా 85 కోట్ల రూపాయలు రిహన్న షో కోసం ఖర్చు చేస్తున్నారంట..

ముఖేష్ అంబానీ అంటేనే ప్రపంచ కుబేరుడు ... అలాంటి ఆయన కుమారుడి ఇంట్లో పెళ్లంటే ఎలా ఉంటుంది మరి..   ఎక్కడా కూడా తగ్గేదేలే అన్నట్టుగానే ఖర్చులు పెట్టేస్తున్నారు.  అనంత్, రాధికల ప్రీ-వెడ్డింగ్ వేడుకలు మార్చి 1న ప్రారంభమై మార్చి 3 వరకు జరుగుతాయి. పలువురు బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు, అలాగే వ్యాపారవేత్తలు ఈ కార్యక్రమానికి విచ్చేయనున్నారు. కాగా గతేడాది జనవరి 19 న ముంబైలో జరిగిన గోల్ ధన కార్యక్రమంలో అనంత్, రాధిక నిశ్చితార్థం చేసుకున్నారు. జూన్ లో వీరు పెళ్లి చేసుకోనున్నారు.