బంగ్లాదేశ్ తో సిరీస్ : రిషబ్ పంత్ దూరం

బంగ్లాదేశ్ తో సిరీస్ : రిషబ్ పంత్ దూరం

బంగ్లాదేశ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో టీమిండియాకు వరుస షాకులు తగులుతున్నాయి.  ఇప్పటికే  సిరీస్ కు ముందు గాయం కారణంగా మహమ్మద్ షమీ, జస్ప్రీత్‌ బుమ్రాలు జట్టుకు దూరం కాగా ... ఇప్పుడు ఆ లిస్టులోకి మరో  ఆటగాడు కూడా చేరాడు.  తొలి వన్డేకు ముందు గాయంతో వికెట్ కీపర్ రిషబ్ పంత్ మొత్తం సిరీస్ కు దూరమయ్యాడు.

మెడికల్ టీమ్ అతన్ని పరీక్షించిందని,  వన్డే జట్టు నుంచి  రిషబ్ పంత్ ను తప్పించినట్లుగా బీసీసీఐ ప్రకటించింది. అయితే బంగ్లాతో టెస్టు సిరీస్ వరకల్లా పంత్ జట్టులోకి వస్తాడని తెలిపింది. కాగా బంగ్లాతో ఇవాళ జరుగుతున్న తొలి వన్డేలో పంత్  స్థానంలో కేఎల్ రాహుల్  కీపింగ్ చేయనున్నాడు.  ఢాకా వేదికగా జరుగుతోన్న  తొలి వన్డేలో బంగ్లాదేశ్  టాస్  గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో టీమిండియా తరుపున  వన్డేల్లోకి కుల్‌దీప్‌ సేన్‌ అరంగేట్రం చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ అతడికి టీమ్‌ఇండియా క్యాప్‌ ఇచ్చి ప్రోత్సహించాడు.

బంగ్లా జట్టు : లిటన్‌ దాస్‌(కెప్టెన్‌), అనాముల్‌ హక్‌, నజ్ముల్‌ హొస్సేన్‌‌, షకిబ్‌, ముష్ఫికర్‌(వికెట్‌ కీపర్‌), మహ్మదుల్లా, అఫిఫ్‌‌, మెహదీ హసన్‌ మిరాజ్‌, హసన్‌ మహ్మూద్‌, ముస్తాఫిజుర్‌, ఎబాదత్‌ హొస్సేన్‌.


టీమిండియా : రోహిత్ శర్మ (కెప్టెన్‌), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ సేన్