
- జమ్మికుంట దగ్గర పట్టా విరిగినట్లు గుర్తింపు
- ట్రాక్ సిబ్బంది సమాచారంతో రైలు నిలిపివేత
ట్రాక్ సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ జంక్షన్ నుంచి బయలుదేరిన ఇంటర్సిటీ (17011) ట్రైన్ జమ్మికుంట స్టేషన్కు చేరుకునే క్రమంలో రైలు పట్టా విరిగిపోయింది. దీన్ని గమనించిన ట్రాక్ సిబ్బంది వెంటనే రైల్వేస్టేషన్ అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో రైలు వేగం తగ్గించి నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు పేర్కొన్నారు. వెంటనే సిబ్బంది రిపేర్ చేయడంతో ట్రైన్ యథావిధిగా బయల్దేరింది.