
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి రిటైర్డ్ కార్మికులకు కనీసం రూ.10 వేలు పెన్షన్అమలు చేయాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఇటీవల పార్లమెంట్ లో ప్రస్తావించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆయన ఫొటోకు సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు శనివారం క్షీరాభిషేకం చేశారు. రామకృష్ణాపూర్లోని రాజీవ్ చౌక్వద్ద సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్ కుమ్మరి మల్లయ్య ఆధ్వర్యంలో ఎంపీ ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. తక్కువ పెన్షన్కారణంగా తాము పడుతున్న ఇబ్బందులను ఎన్నికల ప్రచారం సందర్భంగా వంశీకృష్ణ దృష్టికి తీసుకవెళ్లామన్నారు.
ఆయన ఎంపీ అయిన వెంటనే పార్లమెంట్లో తమ సమస్యలు, ఇబ్బందులను ప్రస్తావించడంతో పాటు కనీస పెన్షన్ రూ.10వేల ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల హక్కులు, డిమాండ్ల కోసం వంశీకృష్ణ కొట్లాడుతున్నారని, ఆయన చొరవ కారణంగా ఇటీవల పెన్షన్ నిధికి రూ.140కోట్లను జమ చేశారన్నారు. ఎంపీ పోరాటం వల్ల తమకు పెన్షన్ పెరుగుతుందని భావిస్తున్నామని పెర్కోన్నారు. రిటైర్డ్ కార్మికులు సాతి శంకరయ్య, మెరుగు బాలయ్య తదితరులు పాల్గొన్నారు.