తుపాన్ ​బోల్తా పడి ఇద్దరు మృతి

తుపాన్ ​బోల్తా పడి ఇద్దరు మృతి

చేవెళ్ల, వెలుగు : అతివేగం..అజాగ్రత్తగా నడపడంతో తుఫాన్​బోల్తాపడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్​–బీజాపూర్​నేషనల్ హైవేపై జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. వికారాబాద్​జిల్లా బషీరాబాద్​మండలం దామరచెడ్​కు చెందిన చెట్టుకింది రమేశ్ (35) డ్రైవర్​గా పని చేస్తున్నాడు. తుపాన్ వాహనంలో శనివారం తెల్లవారుజామున మరో ఏడుగురితో కలిసి హైదరాబాద్​కు బయలుదేరారు.

ఉదయం 7.30 గంటలకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​ మండలం అజీజ్​నగర్​ చౌరస్తా సమీపంలోని మూల మలుపు వద్ద తుపాన్​ అతివేగంతో వెళ్తూ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో డ్రైవర్ రమేశ్​ తో పాటు బోయ లక్ష్మయ్య (65)  స్పాట్ లోనే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్​మార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి మొయినాబాద్​పోలీసులు కేసు నమోదు చేశారు.