రోడ్డు ప్రమాదం: ఆటోను ఢీకొట్టిన బస్సు ..ఒకరు మృతి.. ముగ్గురి పరిస్థితి విషమం

రోడ్డు ప్రమాదం: ఆటోను ఢీకొట్టిన బస్సు ..ఒకరు మృతి.. ముగ్గురి పరిస్థితి విషమం

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్​పోర్టు రోడ్డులో ఆటోను బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా,  ముగ్గురు పరిస్థితి విషమంగా మారింది. శుక్రవారం ఎయిర్​పోర్టు రోడ్డులో 12 మందితో ఓ ఆటో వెళ్తోంది. డెకత్లాన్​ వద్దకు రాగానే ఓ బస్సు ఢీకొట్టింది. దీంతో రమావత్ లక్ష్మణ్(45) అనే వ్యక్తి స్పాట్​లో చనిపోయాడు. మృతుడు నల్గొండ జిల్లా చెన్నంపేట మండలం గువ్వాళగుట్ట గ్రామనికి చెందిన వ్యక్తిగా తెలిసింది.

 మరో 11 మందికి గాయాలు కాగా వారిని శంషాబాద్​ సన్​రైస్​ హాస్పిటల్​కు తరలించారు. ఇందులో  హనుమంతు( 33), వెంకటమ్మ(34), విజయ(24) పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాద వివరాలు ఎయిర్​పోర్టు అధికారులు, పోలీసులు బయటికి వెల్లడించలేదు. అటుగా వెళ్తున్న సీపీఎం నాయకులు వీడియోలు తీసి పెట్టడంతో ప్రమాద విషయం బయటకు వచ్చింది.