స్కూల్​ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు

స్కూల్​ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూల్​ బస్సును ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. స్థానికులు గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. నొప్పితో ఏడ్చిన చిన్నారులను చూసి స్థానికులు కంటతడి పెట్టారు. ఈ ప్రమాదంపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆరా తీశారు. డీఈవో రాధాకిషన్ ను అడిగి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. గాయడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.