కాలువలో పడ్డ కారు.. ఐదుగురు మృతి

కాలువలో పడ్డ కారు.. ఐదుగురు మృతి

సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మునిగడప గ్రామ శివారులో కల్వర్టును ఢీకొని కారు కాలువలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాలువలో నీరు ఉండడంతో కారు మునిగిపోయింది. బాధితులు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వేములవాడ వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు పిల్లలున్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు.