కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

అతివేగం నలుగురు ప్రాణాలు తీసింది. కృష్ణా జిల్లా జగ్గయ్య పేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. జగ్గయ్య పేట మండలం గరికపాడు చెక్ పోస్ట్ సమీపంలో మహబూబ్ నగర్ జిల్లా వాసులు ప్రయాణిస్తున్న కారు అతివేగంతో..ఎదురుగా ఉన్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లో చనిపోగా..మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో ప్రాణాలు కోల్పోయారు.