లోయలో పడ్డ ఆర్మీ ట్రక్కు

లోయలో పడ్డ ఆర్మీ ట్రక్కు

సిక్కింలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ జవాన్లతో వెళ్తున్న ట్రక్ లోయలో పడింది. ఈ ఘటనలో16 మంది జవాన్లు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన జవాన్లను హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలిస్తున్నారు. ట్రక్కు మలుపుతిరుగుతున్న సమయంలో స్కిడ్ కావడంతో ప్రమాదం జరిగిందని ఆర్మీ ప్రకటించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

సిక్కిం ఘటనపై స్పందించిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్  జవాన్ల మృతి తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. జవాన్ల సేవలు, అంకితభావానికి జాతియావత్తు ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని చెప్పారు. మృతి చెందిన జవాన్ల కుటుంబాలకు సంతాపం తెలిపిన రాజ్ నాథ్ గాయపడిన వారు వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.