గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బారామతి సమీపంలో టు వీలర్ పైకి టిప్పర్ లారీ దూసుకెళ్ళింది. ఈ ఘటనలో టూవీలర్ పై ప్రయాణం చేస్తున్న ఇద్దరు దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని అంబులెన్స్ లో స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. ఈ ప్రమాదంలో రెండు సంవత్సరాల బేబీ మృతి చెందింది. ఇక గాయపడిన మహిళ గర్భవతి అని సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.