
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. కోహెడ ఔటర్ రింగ్ రోడ్ సమీంపలో ముందు వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని కారు ఢీకొట్టడంతో తల్లీకూతుళ్లు ఇద్దరు అక్కడిక్కడే చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారు హయత్ నగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు త్రివేణి, రితికగా గుర్తించారు పోలీసులు. బెంగళూర్ నుంచి యాదాద్రికి వస్తుండగా ప్రమాదం జరిగింది.