వేర్వేరు ప్రమాద ఘటనల్లో నలుగురు మృతి

వేర్వేరు ప్రమాద ఘటనల్లో నలుగురు మృతి

ఏపీలో శుక్రవారం ఉదయం రెండు వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాద ఘటనల్లో నలుగురు మృతి చెందారు. విశాఖ జిల్లాలో కసింకోట మండలం తాళ్లపాలెం నేషనల్ హైవేపై నడుచుకుంటూ వెళ్తున్న దంపతులను పెట్రోల్ ట్యాంకర్ ఢీకొట్టింది.  దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తాళ్లపాలెం గ్రామానికి చెందిన కరణం సోమినాయుడు, పైడితల్లిగా గుర్తించారు. పోలీసుల సమాచారంతో మృతుల బంధువులు, గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకొని రోదిస్తున్నారు. మరో చోట కర్నూలు జిల్లాలో కూడా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు, లారీని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.