అంత్యక్రియలకు వెళ్తుండగా యాక్సిడెంట్.. ముగ్గురు మృతి

అంత్యక్రియలకు వెళ్తుండగా యాక్సిడెంట్.. ముగ్గురు మృతి
  • బైక్​ను ఢీకొట్టిన బస్సు.. ముగ్గురు మృతి
  •     అంత్యక్రియలకు వెళ్తుండగా యాక్సిడెంట్
  •     నారాయణపేట జిల్లా మక్తల్​లో ఘటన

మక్తల్, వెలుగు: బైక్​ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ముగ్గురు యువకులు చనిపోయారు. ఈ ఘటన నారాయణపేట జిల్లా మక్తల్​లో మంగళవారం చోటు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కర్నాటక స్టేట్​కు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి రాయచూర్ వెళ్తున్నది. నారాయణపేట జిల్లా మక్తల్ నుంచి రాఘవేంద్ర చారి అలియాస్ రఘు, మున్నూరు వెంకటేశ్, మహేశ్ ఒకే బైక్​పై ధన్వాడ మండలం పూసల్​పాడ్​కు వెళ్తున్నారు. వీరి ఫ్రెండ్ అయిన రవి తల్లి చనిపోవడంతో అంత్యక్రియలకు బయల్దేరారు. 

మక్తల్ సమీపంలోని దండు క్రాసింగ్ దగ్గరకు రాగానే కర్నాటకకు చెందిన ఆర్టీసీ బస్సు వీరి బైక్​ను ఢీకొట్టింది. దీంతో రఘు (26), వెంకటేశ్ (23) స్పాట్​లోనే చనిపోయారు. మహేశ్ (18) తీవ్రంగా గాయపడగా.. మక్తల్ గవర్నమెంట్ హాస్పిటల్​కు తరలించారు. తర్వాత అక్కడి నుంచి మహబూబ్​నగర్ జిల్లా హాస్పిటల్​లకు తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు. రఘుకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈ ముగ్గురు ఫొటో, వీడియో గ్రాఫర్​గా పని చేసేవాళ్లు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధితుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ భాగ్యలక్ష్మి తెలిపారు. యాక్సిడెంట్​కు కారణమైన బస్సును పోలీస్ స్టేషన్​కు తరలించారు.