సీఎం వస్తడేమోనని రోడ్ల రిపేర్లు

సీఎం వస్తడేమోనని రోడ్ల రిపేర్లు

రామాయంపేట నుంచి సిద్దిపేటకు వెళ్లే మెయిన్​ రోడ్డు చాలా చోట్ల అధ్వానంగా మారింది. రామాయంపేట మండలం కోనాపూర్​ సమీపంలో దాదాపు మూడు కిలోమీటర్ల గుంతలు పడి, కంకర తేలి వెహికల్స్​ రాకపోకలకు తీవ్ర అసౌకర్యంగా మారి నెలలు గడుస్తున్నా.. ఆర్​ అండ్​ బీ అధికారులు పట్టించుకోలేదు. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా స్పందించని ఆఫీసర్లు శనివారం రోడ్డు రిపేర్లు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మొదలుపెట్టారు. కారణం.. ఆదివారం సిద్దిపేటకు వస్తున్న సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కామారెడ్డికి వెళ్లే చాన్స్‌ ఉండడంతో రిపేర్లు చేశారు.  – మెదక్/రామాయంపేట, వెలుగు