
పాపన్నపేట, వెలుగు:ఎక్కడైనా డబుల్రోడ్డు, డివైడర్నిర్మాణానికి ఫండ్స్మంజూరైతే మొదట ఒకవైపు రోడ్డు వేసి.. తర్వాత డివైడర్నిర్మిస్తారు. అనంతరం రెండో వైపు రోడ్డు వేస్తారు. ఒకవేళ ముందుగా డివైడర్నిర్మించాలనుకుంటే రోడ్డు విస్తరణ పనులు చేపట్టి పునాదులు తీసి డివైడర్కడతారు. అయితే మెదక్జిల్లా పాపన్నపేట మండల కేంద్రంలో అందుకు విరుద్ధంగా పనులు చేస్తున్నారు. మెదక్– బొడ్మట్పల్లి హైవే నుంచి పాపన్నపేటకు ఉన్న రోడ్డు పూర్తిగా ధ్వంసమై గుంతలు తేలడంతో గతేడాది రూర్బన్స్కీం కింద రూ.56లక్షలు శాంక్షన్ కావడంతో 300 మీటర్లు సీసీ రోడ్డు నిర్మించారు. మరో 300 మీటర్లు సీసీ రోడ్డు నిర్మించేందుకు రూ.1.20కోట్లు మంజూరు కాగా ఇంతవరకు టెండర్లు ఖరారు కాలేదు. అయితే ఇదే రోడ్డుపై 600 మీటర్ల మేర డివైడర్, బటర్ఫ్లై లైట్లు ఏర్పాటు చేసేందుకు రూ.50 లక్షలు మంజూరయ్యాయి. ఆ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్మొదట నిర్మించిన సీసీ రోడ్డు మధ్యలో డివైడర్ నిర్మించి ఆపకుండా.. మిగిలిన చోట కూడా డివైడర్కట్టుకుంటూ పోతున్నాడు. కొంత లోతు నుంచి పునాదులు తీయకుండా, మట్టిరోడ్డు పైనే తూతూ మంత్రంగా నిర్మిస్తున్నాడు. ఈ పనులపై జనం నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సీసీ రోడ్డు వేయకుండా డివైడర్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, కోఆర్డినేషన్, పర్యవేక్షణ లేకపోవడమే కారణమని మండిపడుతున్నారు. ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా కడుతున్న డివైడర్ రోడ్డు నిర్మించేలోపే పడిపోయాలా ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మండల కేంద్రంలో ప్రతి
బుధవారం జరిగే సంతకు వచ్చే వ్యాపారులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై పంచాయతీ రాజ్ ఏఈ గోపాల్ ను వివరణ కోరగా మరో 300 మీటర్లు సీసీ రోడ్డు నిర్మించాల్సి ఉందని, రూ.1.20 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. టెండర్ప్రాసెస్లో ఉందని, ఫైనల్ కాగానే సీసీ రోడ్డు నిర్మిస్తామని చెప్పారు.