- అల్మాసుగూడలో పోలీసుల పై దొంగల దాడి
- పట్టుకోబోతుండుగా పారిపోయే ప్రయత్నం
- ఒకరిని అదుపులోకి తీసుకున్న మీర్ పేట్ పోలీసులు
మీర్ పేట్,వెలుగు: ఒక దొంగతనం చేసి మరో దోంగతనానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసుల కంట పడ్డారు. రాత్రి 2 గంటల సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు అనుమానం వచ్చి ఆ వ్యక్తుల్ని ఎవరని ప్రశ్నించగా తామూ పోలీసులమని చెప్పారు. ఐడీ కార్డు చూపించాలని అడగడంతో.. వారి నుంచి తప్పించుకునేందుకు రాళ్లతో దాడి చేసి పరారయ్యేందుకు యత్నించారు. ఈ సంఘటన గురువారం ఆర్ధరాత్రి మీర్ పేట్ పోలిసు స్టేషన్ పరిధిలోని అల్మాసు గూడలో జరిగింది.
మారుతి నగర్ లో బైక్ పై పెట్రోలింగ్ చేస్తున్న కానిస్టేబుళ్లు ఎల్లయ్య, గోపాల్ లకు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరించడం కనిపించింది. వారి గురించి ఆరా తీసే క్రమంలో దొంగలని తేలడంతో.. ఇద్దరినీ పట్టుకునేందుకు ప్రయత్నించారు. వారిని పీఎస్ తరలించే క్రమంలో ఒకడు రాళ్లతో దాడి చేసి పరారయ్యాడు. మరొకడు పోలీసుల చేతికి చిక్కాడు. పారిపోయిన వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు సీఐ యాదయ్య తెలిపారు.