కోవిడ్ కేంద్రంలో దొంగతనం..

కోవిడ్ కేంద్రంలో దొంగతనం..

కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రంలో చోరీ జరిగింది. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోని కోవిడ్ కేంద్రం గది తాళాలు పగులగొట్టి రెండు మానిటర్లు ఎత్తుకెళ్లారు. ఈ సీన్ మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దొంగతనానికి వచ్చిన వ్యక్తి.. ముందుగా బీరువా తాళం పగులగొట్టాడు. అందులో ఏం దొరకకపోవడంతో కంప్యూటర్ మానిటర్లు ఎత్తుకెళ్లాడు. ఆస్పత్రి సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసలు.. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.