
థాయ్ లాండ్: కరోనా రిస్క్ నుంచి డాక్టర్లు, నర్సులు, మెడికల్ సిబ్బందిని కాపాడేందుకు థాయ్ లాండ్ సర్కార్ రోబోల ను రంగంలోకి దించింది. నింజ పేరుతో 4 రోబోలను బ్యాంకాక్లోని హాస్పిటల్స్లో ఏర్పాటు చేశారు. పేషెంట్లతో నేరుగా ఇంటరాక్ట్ అవడం వల్ల డాక్టర్లు, నర్సులు కూడా ఇన్ఫెక్షన్ కు గురవుతున్నారు. దీంతో డాక్టర్ల కన్నా ముందు పేషెంట్లు నింజ రోబోస్ దగ్గరే ఉండి డాక్టర్లతో వీడియో కాల్లో మాట్లాడే విధంగా వీటిని రూపొందించారు. పేషెంట్ టెంపరేచర్ను కూడా రోబోలే రికార్డు చేస్తాయి. మెడికల్ సిబ్బంది కి రిస్క్ తగ్గించేందుకే నింజ రోబోలు ఏర్పాటు చేశామని చులలంగ్ వర్సిటీపేర్కొంది.