
ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లు, కేప్టెన్లు ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేర్లు రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ. ముంబై ఇండియన్స్ కేప్టెన్ గా రోహిత్ ఐదు టైటిల్స్ గెలిస్తే, చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ధోనీ నాలుగు కప్పులు నెగ్గాడు. వీటితో పాటు అనేక రికార్డ్ లను సొంతం చేసుకున్న ఈ ఇద్దరు, ఐపీఎల్ తరుపున ఎక్కువ జీతం అందుకున్న ఆటగాళ్ల జాబితాలో టాప్ లో నిలిచారు.
మనీబాల్ నిర్వహించిన నివేదిక ప్రకారం మొత్తం 16 సీజన్లలో రోహిత్ రూ.178.6 కోట్లు వేతనంగా పొందాడు. రెండో స్థానంలో ధోనీ ఉన్నాడు. అతని సంపాదన రూ.176.84 కోట్లుగా ఉంది. వాళ్ల తర్వాత ఆర్ సీబీ టీం ప్లేయర్ విరాట్ కోహ్లి రూ.173.2 కోట్లు, సురేశ్ రైనా రూ.110 కోట్లు, జడేజా రూ.109 కోట్లు అందుకున్నారు. గౌతమ్ గంభీర్ రూ. 94.62 క కోట్లు సంపాదించాడు. విదేశీ ఆటగాళ్లలో సునీల్ నరైన్ రూ.107.2 కోట్లు, ఏబీ డివిలియర్స్ రూ.102.5 కోట్లు సొంతం చేసుకున్నారు.