T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ

T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ

టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా ఓపెనర్లు ఎవరనే ప్రశ్నపెద్ద సవాలుగా మారింది. ఒక ఓపెనర్ గా రోహిత్ కన్ఫర్మ్ కాగా.. మరో ఓపెనర్ ఎవరనే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. యువ ఆటగాళ్లు ఇషాన్ కిషాన్, శుభమాన్ గిల్, జైస్వాల్, గైక్వాడ్ లలో ఎవరు హిట్ మ్యాన్ కు ఓపెనింగ్ పార్ట్ నర్ అనే విషయం అర్ధం కావట్లేదు. అయితే వీరందరిని కాదని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేసే అవకాశాలు లేకపోలేదు. తాజాగా ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి ఒక వార్త చక్కర్లు కొడుతుంది. 

Also Read:శ్రేయాస్ అయ్యర్‌కు షాక్.. 12 లక్షల జరిమానా

టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టీమిండియా ఓపెనర్లుగా ఆడతారని నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఐపీఎల్ లో ఓపెనర్ గా అదరగొడుతున్న కోహ్లీ..7 ఇన్నింగ్స్ ల్లో 361 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో రోహిత్ తో కలిసి విరాట్ ఓపెనింగ్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. రోహిత్, కోహ్లీ ఓపెనింగ్ చేస్తే గిల్, జైస్వాల్ కు జట్టులో స్థానం దక్కపోవచ్చు. ఎంపిక చేయాలనుకుంటే గిల్ మూడో స్థానంలో సూర్య నాలుగో స్థానంలో ఆడే ఛాన్స్ ఉంది. దీని ప్రకారం యశస్వి జైస్వాల్ కు టీమిండియా వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కడం అనుమానంగా మారింది. 

మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే రింకూ సింగ్, హార్దిక్ పాండ్య, జడేజా వరుసగా 5,6,7 స్థానాల్లో బ్యాటింగ్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. బుమ్రా, కుల్దీప్ తుది జట్టులో ఉండడటం ఖాయం. మరో పేసర్ గా ఎవరు ఆడతారనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది. షమీ గాయం..  సిరాజ్ ఫామ్ లో లేకపోవడం.. యంగ్ బౌలర్ మయాంక్ యాదవ్ గాయపడడం టీమిండియాను కలవరానికి గురి చేస్తుంది.