అబుదాబి: ఐపీఎల్లోనే మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ తమ టీమ్ ముంబై ఇండియన్స్తో కలిసి ఇప్పటికే యూఏఈ చేరుకున్నాడు. భార్య రితికా సజ్దే, కూతురు సమైరాతో కలిసి యూఏఈ వెళ్లిన రోహిత్ ప్రస్తుతం అబుదాబిలో ఉన్నాడు. ఆరు రోజుల క్వారంటైన్ తప్పనిసరి కావడం, వేరే వాళ్లను కలిసే చాన్స్ లేకపోవడంతో వీళ్లంతా హోటల్ రూమ్కే పరిమితమయ్యారు. దీంతో రోహిత్ తన లైఫ్ పార్ట్ నర్నే వర్కౌట్ పార్ట్ నర్ గా ఎంచుకున్నాడు. వైఫ్ రితికాతో కలిసి వర్కౌట్స్ చేశాడు. ఆ వీడియోను
‘టుగెదర్ స్ట్రాంగ్’ అంటూ మంగళవారం సోషల్ మీడియాలో పెట్టిన రోహిత్ ఫ్యాన్స్ ను ఫిదా చేశాడు. రోహిత్ మాత్రమే కాదు క్వారంటైన్ రూల్ వల్ల లీగ్ కోసం యూఏఈ వెళ్లిన ప్రతీ ప్లేయర్ తమ గదిలోనే వర్కౌట్స్ చేస్తున్నారు.