
డిసెంబర్ 22న మిర్పూర్లో బంగ్లాదేశ్తో జరగబోయే రెండో టెస్టు మ్యాచ్ కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులోకి రానున్నాడు. బంగ్లాతో జరిగిన రెండో వన్డేలో వేలికి గాయం కావడంతో రోహిత్ మూడో వన్డే ఆడలేకపోయాడు. ట్రీట్మెంట్ కోసం ముంబైకి వచ్చిన రోహిత్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్లుగా తెలుస్తోంది. బంగ్లాతో జరగబోయే రెండో టెస్టు వరకు రోహిత్ ఫిట్ కానున్నాడట. ఒకటి రెండు రోజుల్లో అతడు బంగ్లాదేశ్కు పయనం కానున్నాడని సమాచారం.
గాయం కారణంగా రోహిత్ జట్టుకు దూరం కావడంతో అతని ప్లేస్ లో రాహుల్ భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా వంటి చాలా మంది క్రికెటర్లకు గాయలు కావడంతో బంగ్లా సిరీస్ కు ఎంపిక కాలేకపోయారు.
రెండో టెస్టులో రోహిత్ శర్మ రీఎంట్రీ ఇస్తే, శుబ్మన్ గిల్ రిజర్వు బెంచ్కే పరిమితం కావాల్సి ఉంటుంది. బంగ్లాతో జరుగుతోన్న ఫస్ట్ టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్లో 20 పరుగులకే ఔటైన గిల్ సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం సెంచరీ బాదాడు. ఇదే అతనికి ఫస్ట్ సెంచరీ కావడం విశేషం.