Rohit Sharma: కొత్త రికార్డుకు అడుగు దూరంలో రోహిత్ శర్మ

Rohit Sharma: కొత్త రికార్డుకు అడుగు దూరంలో రోహిత్ శర్మ

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. మరో రెండు రోజుల్లో ఈ మెగా సిరీస్‌కు తెరలేవనుంది.  అయితే, ఈ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ సిరీస్ లో రోహిత్ ఒక సెంచరీ చేస్తే కెప్టెన్ గా టెస్టు, వన్డే, టీ20ల్లో సెంచరీలు చేసిన తొలి భారత కెప్టెన్ గా రికార్డు నెలకొల్పుతాడు. ఇప్పటివరకు రోహిత్ కెప్టెన్ గా వన్డే, టీ20ల్లో సెంచరీలు బాదాడు. ఇక టెస్టు ఒక్కటే మిగిలుంది. ఇందులోనూ సెంచరీ చేస్తే మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన కెప్టెన్ల లిస్ట్ లో తిలకరత్నే దిల్షాన్, డుప్లెసిస్, బాబర్ ఆజామ్ సరసన చేరుతాడు. రోహిత్ కెప్టెన్ గా వన్డేల్లో 3, టీ20ల్లో 2 సెంచరీలు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు