సాంస్కృతిక సంబురాల్లో డ్యాన్స్ చేసిన రోజా

సాంస్కృతిక సంబురాల్లో డ్యాన్స్ చేసిన రోజా

తిరుపతి: జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు తిరుపతిలో ఉత్సాహంగా సాగుతున్నాయి. సంబరాల్లో భాగంగా కళాకారులు విభిన్న కళారూపాలను ప్రదర్శించారు. రెండో రోజు సంబరాల్లో పాల్గొన్న ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సాంస్కృతిక కార్యక్రమాలను చూసి ఉత్సాహంతో స్టేజీ ఎక్కి విద్యార్థినులతో కలిసి  కాసేపు డ్యాన్స్ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి రోజా పిల్లలతో కలిసి డ్యాన్స్ చేయడం చాలా సంతోషం కలిగించిందన్నారు. తన స్టూడెంట్ లైఫ్ ను ఆమె గుర్తు చేసుకున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు మూలాలు కళలని....వాటిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పని చేస్తుందన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడం మనందరి బాధ్యత అన్నారు. కళల పరిరక్షణే ధ్యేయంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి రోజా వివరించారు.