ఇంటింటి చెత్త సేకరణ సరిగా నిర్వహించాలి : రోనాల్డ్ రాస్

ఇంటింటి చెత్త సేకరణ  సరిగా నిర్వహించాలి  :   రోనాల్డ్ రాస్

సికింద్రాబాద్​, వెలుగు: ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా నిర్వహించాలని బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం చార్మినార్ జోన్ అత్తాపూర్ డివిజన్​లో చెరువులు, శానిటేషన్ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 

పెద్ద తాళ్ల కుంట చెరువును బ్యూటిఫికేషన్ చేస్తామని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, నార్కోటిక్స్ ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ అధికారులు కమిషనర్​ను కోరగా లేఖ ఇవ్వాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని వారికి సూచించారు.   అనంతరం కమిషనర్ శానిటేషన్ పాయింట్లను పరిశీలించారు. చెత్త సేకరణ సరిగా నిర్వహించాలన్నారు.