
సికింద్రాబాద్, వెలుగు: ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా నిర్వహించాలని బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం చార్మినార్ జోన్ అత్తాపూర్ డివిజన్లో చెరువులు, శానిటేషన్ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పెద్ద తాళ్ల కుంట చెరువును బ్యూటిఫికేషన్ చేస్తామని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, నార్కోటిక్స్ ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ అధికారులు కమిషనర్ను కోరగా లేఖ ఇవ్వాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని వారికి సూచించారు. అనంతరం కమిషనర్ శానిటేషన్ పాయింట్లను పరిశీలించారు. చెత్త సేకరణ సరిగా నిర్వహించాలన్నారు.