ముంపు ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన రోనాల్డ్​రోస్​

ముంపు ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన రోనాల్డ్​రోస్​

హైదరాబాద్​లో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. జీహెచ్​ఎంసీ కమిషనర్​ రోనాల్డ్​రోస్​ జులై 20 అర్ధరాత్రి ముంపు ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. కుత్బుల్లాపూర్​లో వరద ప్రభావిత ప్రాంతాలను డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ డైరెక్టర్​ ప్రకాశ్​రెడ్డి తో కలిసి ఆయన సందర్శించారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 

భారీ వర్షాలున్నాయన్న అంచానాల నేపథ్యంలో సిబ్బంది పబ్లిక్​కు అందుబాటులో ఉండేలా చూడాలని జోనల్​ కమిషనర్​కు ఆదేశించారు. గాజులరామారం బాలాజీ ఎంక్లేవ్​ చుట్టూ ఉన్న కాలనీల్లో వరద ప్రవాహాన్ని.. డ్రైనేజీలను పరిశీలించారు. లోతట్టు ప్రాంత వాసుల సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించాలని అధికారులను సూచించారు.  

భారీ వర్షాలతో హైదరాబాద్లో చాలా చోట్ల డ్రైనీజీలు పొంగి పొర్లుతున్నాయి. అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు.