హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రోస్ జులై 20 అర్ధరాత్రి ముంపు ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. కుత్బుల్లాపూర్లో వరద ప్రభావిత ప్రాంతాలను డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ప్రకాశ్రెడ్డి తో కలిసి ఆయన సందర్శించారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
భారీ వర్షాలున్నాయన్న అంచానాల నేపథ్యంలో సిబ్బంది పబ్లిక్కు అందుబాటులో ఉండేలా చూడాలని జోనల్ కమిషనర్కు ఆదేశించారు. గాజులరామారం బాలాజీ ఎంక్లేవ్ చుట్టూ ఉన్న కాలనీల్లో వరద ప్రవాహాన్ని.. డ్రైనేజీలను పరిశీలించారు. లోతట్టు ప్రాంత వాసుల సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించాలని అధికారులను సూచించారు.
భారీ వర్షాలతో హైదరాబాద్లో చాలా చోట్ల డ్రైనీజీలు పొంగి పొర్లుతున్నాయి. అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు.