
ఖైరతాబాద్, వెలుగు: ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ రూఫ్ కు లీకేజీ ఏర్పడింది. శనివారం ఉదయం, రాత్రి సమయంలో కురిసిన భారీ వర్షానికి ప్లాట్ఫాంపై నీరు కారింది. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈఎస్ఐ, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, ఇర్రంమంజిల్ మెట్రో స్టేషన్లలో రూఫ్లీకేజీ సమస్య ఉంది. వర్షం పడిన టైంలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మెట్రో అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.