ఇవాళ ఢిల్లీకి గులాబీ లీడర్లు

ఇవాళ ఢిల్లీకి గులాబీ లీడర్లు

హైదరాబాద్: గులాబీ లీడర్లు ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని  కలవనున్నారు. టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) పార్టీని బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి)గా పేరు మార్పుకు సంబంధించిన అంశాలను సీఈసీతో మాట్లాడనున్నట్లు సమాచారం. గులాబీ పార్టీ తరపున సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్ తో మరికొందరు నేతలు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. పార్టీ పేరు మార్పు గురించి నిన్న జరిగిన సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానం ప్రతులను కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ పేరు మార్పుపై గులాబీ బాస్.. సీఎం కేసీఆర్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. పార్టీ రాజ్యాంగాన్ని సవరించి టీఆర్ఎస్ ను భారత్ రాష్ట్ర సమితిగా మార్చినట్టు లేఖలో వివరించారు.