లిక్కర్ అమ్మితే రూ.10 వేలు ఫైన్

లిక్కర్ అమ్మితే రూ.10 వేలు ఫైన్

నిజాంపేట, వెలుగు : మెదక్  జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నగరం తండాలో మద్యపానంపై నిషేధం విధించారు. శుక్రవారం సర్పంచ్  గేమ్  సింగ్  ఆధ్వర్వంలో పంచాయతీ పాలకవర్గం సమావేశమై ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. సర్పంచ్  మాట్లాడుతూ తండాలో ఎవరూ లిక్కర్​ అమ్మరాదని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే రూ.10 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎంపీటీసీ లలితా రవి, ఉప సర్పంచ్, వార్డు  మెంబర్లు పాల్గొన్నారు. 

ALSO READ :ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌లో 1.18 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి