
- .. స్వీట్హౌస్, పర్మిట్రూమ్లకు రూ.20,500 జరిమానాలు విధింపు
మెదక్ టౌన్, వెలుగు: మెదక్ పట్టణంలోని అన్ని స్వీట్హౌస్, పర్మిట్ రూంలు, దుకాణాల్లో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. గురువారం జిల్లా కేంద్రం మెదక్ పట్టణంలోని పలు స్వీట్ షాపులు, పర్మిట్రూమ్లు, టిఫిన్ సెంటర్లపై ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్నాగరాజు ఆధ్వర్యంలో ఆకస్మికంగా దాడులు చేశారు.
ఈ సందర్భంగా పట్టణంలోని ఐసీఐసీఐ బ్యాంకు వద్ద ఉన్న బాలాజీ గణేశ్ స్వీట్ హౌస్కు రూ.10 వేలు, ఆటోనగర్లోని బాలాజీ హర్షిత్ స్వీట్హోమ్కు రూ.5 వేలు, ఆటోనగర్లోని భద్రకాళి వైన్స్కు సంబంధించి పర్మిట్ రూమ్కు రూ.5 వేలు, ఫతేనగర్లోని సంధ్య టిఫిన్ సెంటర్కు రూ.500 జరిమానా విధించారు. అన్ని వార్డుల్లో వార్డు అధికారులతో భువన్ సర్వే నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.