నిజామాబాద్ జిల్లాలో రైతు భరోసా రూ.214.56 కోట్లు జమ : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

నిజామాబాద్ జిల్లాలో  రైతు భరోసా రూ.214.56 కోట్లు జమ  : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

నిజామాబాద్, వెలుగు: జిల్లాలో 2,98, 472 రైతులకుగాను ఇప్పటివరకు 2,38,247 మందికి రైతుభరోసా కింద రూ.214.56 కోట్లు జమయ్యాయని కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి  గురువారం ప్రకటన రిలీజ్ చేశారు. ఐదెకరాల్లోపు రైతులకు భరోసా డబ్బు బ్యాంక్​ ఖాతాల్లో  జమైందన్నారు.

జూన్​ 5 వరకు కొత్త పాస్​బుక్స్​ పొందినవారు  రైతుభరోసా మంజూరు కోసం ఏఈవోలను కలిసి సరైన ధ్రువీకరణపత్రాలు అందించాలని తెలిపారు.