
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో 2,98, 472 రైతులకుగాను ఇప్పటివరకు 2,38,247 మందికి రైతుభరోసా కింద రూ.214.56 కోట్లు జమయ్యాయని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి గురువారం ప్రకటన రిలీజ్ చేశారు. ఐదెకరాల్లోపు రైతులకు భరోసా డబ్బు బ్యాంక్ ఖాతాల్లో జమైందన్నారు.
జూన్ 5 వరకు కొత్త పాస్బుక్స్ పొందినవారు రైతుభరోసా మంజూరు కోసం ఏఈవోలను కలిసి సరైన ధ్రువీకరణపత్రాలు అందించాలని తెలిపారు.