జీడిమెట్ల, వెలుగు: వేంకటేశ్వర స్వామి ఆలయంలో చొరబడిన ఇద్దరు దొంగలు గుడి తాళాలు పగలగొట్టి స్వామివారి బంగారు నగలు, వెండి విగ్రహాలను దొంగలించారు. కూకట్పల్లి సర్ధార్పటేల్నగర్లోని వేంకటేశ్వరస్వామి దేవాలయం వద్దకు మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వచ్చారు. గుడి తాళాలను కట్టర్తో పగులగొట్టి గర్భగుడిలోకి వెళ్లారు.
స్వామివారి మూల విరాట్కి సంబంధించిన సుమారు 13 కిలోల వెండి విగ్రహాలు, శంకు చక్రాలతో పాటు బంగారం ఆభరణాలు దొంగలించి సూట్ కేసులో పెట్టుకుని పారిపోయారు. ఉదయం పూజ చేయడానికి వచ్చిన పూజారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. చోరీకి గురైన సొత్తు విలువ సుమారు రూ.40 లక్షలు ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆలయాన్ని కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్ పరిశీలించారు.
