టెక్సస్​ ఆలయంపై రూ.8 కోట్లకు దావా

టెక్సస్​ ఆలయంపై రూ.8 కోట్లకు దావా

హ్యూస్టన్ :  అమెరికాలోని ఓ దేవాలయంతో పాటు ఆలయ ట్రస్ట్​పై ఇండియన్ అమెరికన్ విజయ్ దావా వేశారు. ఓ వేడుక సందర్భంగా గుడికి వెళ్లిన తన పదకొండేండ్ల కొడుకుకు వాతలు పెట్టారని మండిపడ్డారు. పిల్లాడి రెండు భుజాలపై విష్ణువు ఆకారంలో రెండు ముద్రలు వేశారని పిటిషన్​లో పేర్కొన్నారు. 

ఇందుకు రూ.8 కోట్లకు పైగా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ‘‘టెక్సస్​ షుగర్​ల్యాండ్​లోని శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో 2023లో జరిగిన వేడుకకు నా కొడుకు వెళ్లాడు. అక్కడ పిల్లాడు వద్దన్నా వినకుండా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వాళ్లు ముద్రలు వేశారు. ఆపై కొద్దిరోజుల్లోనే విపరీతమైన నొప్పి రావడంతో ఈ విషయం బయటపడింది. ఇప్పుడు ఇన్​ఫెక్షన్ కావడంతో ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇది చెరిపివేయలేని తీవ్ర గాయం. ఇందుకు రూ.8.33 కోట్లు పరిహారంగా ఇవ్వాలి” అని విజయ్ తన పిటిషన్​లో పేర్కొన్నారు.