
హైదరాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లాలోని కోటిపల్లి వాగు ఆధునికీకరణకు, పూడికతీత పనులకు రాష్ట్రసర్కారు రూ.89.30 కోట్ల నిధులను మంజూరు చేసింది.ఈ మేరకు శుక్రవారం ఇరిగేషన్శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. పూడికతీతకు సంబంధించి పలు గైడ్లైన్స్ను విధించారు. పూడిక ఎంత మేర తీయాలో శాస్త్రీయంగా అంచనా వేయాలన్నారు. ‘‘ప్రాజెక్టు వాస్తవ సామర్థ్యం, ప్రస్తుతమున్న సామర్థ్యం, పూడిక ఎంత పేరుకుపోయింది స్టడీ చేయాలి.
ప్రతి 15 మీటర్ల దూరానికి ఎంత పూడిక వస్తున్నదో రికార్డ్ మెయింటెయిన్ చేయాలి. అందుకు క్వాలిటీ కంట్రోల్విభాగం సిబ్బంది సాయం తీసుకోండి. ఎంత లోతు వరకు పూడికను సురక్షితంగా తీయవచ్చో అంచనా వేయాలి. నీళ్లు భూమిలోకి ఇంకకుండా చేసే గట్టి పొరను తెలుసుకుంటూ పూడికను తీయాలి. లేదంటే ప్రాజెక్ట్బెడ్లో నిల్వ ఉన్న నీళ్లు భూమిలోకి ఇంకే అవకాశం ఉంటుంది. అందుకు అనుగుణంగా ప్రతి 50 నుంచి వంద మీటర్లకో ట్రెయిల్పిట్స్(కందకాలు)ను తవ్వాలి. వెలికి తీసిన పూడికపై ప్రతి క్యూబిక్మీటర్కూ లెక్క ఉండాలి. అందుకు రిజిస్టర్లు నిర్వహించాలి’’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.