కామారెడ్డి, వెలుగు : ఈ నెల 3న కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్ విద్యా నోడల్ అధికారి షేక్సలాం, హెచ్సీఎల్ ఇన్చార్జి రాజుల రాజేశ్ కుమార్ గురువారం తెలిపారు. 2024, -25లో ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులు, 2026లో ఇంటర్ పూర్తి చేసుకునే విద్యార్థులకు హెచ్సీఎల్ టెక్బీ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు.
హెచ్సీఎల్ టెక్ వారు నిర్వహిస్తున్న టెక్ బీ ప్రోగ్రాం కోసం ఎంపీసీ, సీఈసీ, బీపీసీ, ఓకేషనల్, హెచ్ ఈసీ గ్రూప్ విద్యార్థులు ఈ మేళాకుహాజరుకావాలన్నారు. మేళాకు వచ్చే విద్యార్థులు తమ వెంట ఎస్సెస్సీ మెమో, ఇంటర్ పాస్ లేదా ఆన్లైన్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు తీసుకొని రావాలన్నారు. పూర్తి వివరాలకు హెచ్సీఎల్ ఏరియా ప్రతినిధి రాజుల రాజ్కుమార్ ఫోన్ నంబర్ 8074065803, 97665424 ను సంప్రదించాలని సూచించారు.
