BRS నేతల దోపిడీపై మాట్లాడితే ఫోన్లు హ్యాక్ చేస్తారా?: ప్రవీణ్ కుమార్

 BRS నేతల దోపిడీపై మాట్లాడితే ఫోన్లు హ్యాక్ చేస్తారా?: ప్రవీణ్ కుమార్

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అండదండలతో బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా దోపిడీలకు పాల్పడుతున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నోటిఫైడ్, ఫారెస్ట్ భూములను ఎమ్మెల్యేలు వారి అనుచరులు అక్రమించుకుంటున్నారని ఆరోపించారు. పేదల హక్కుల కోసం బీఆర్ఎస్  నేతల దోపిడీపై మాట్లాడితే ఫోన్లు హ్యాక్ చేస్తారా? అని ప్రశ్నించారు. ఇజ్రాయిల్ నుండి తీసుకొచ్చిన సాఫ్ట్ వేర్ ను దమ్ముంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దోపిడీపై ప్రశ్నించే సర్పంచ్ లు, నేతలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. 

తన ఫోన్ హ్యాక్ చేసినట్టు యాపిల్ కంపెనీ నుంచి మెయిల్ వచ్చిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఫోన్ లోని విలువైన సమాచారాన్ని దొంగలించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. విపక్షాలు, ప్రజాసంఘాలు, జర్నలిస్టుల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారని ఆరోపించారు.