ఓయూ,వెలుగు: ఫోన్పే ద్వారా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయించుకుని పారిపోయిన యువకుడిని ఓయూ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద రూ.20వేల నగదు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఓయూ డివిజన్ఏసీపీ జగన్ మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. కుత్బుల్లాపూర్పరిధి షాపూర్ నగర్లో ఉండే మహ్మద్ సబీల్(33) ర్యాపిడో డ్రైవర్. మద్యానికి బానిసగా మారిన అతను ఆన్లైన్బెట్టింగ్గేమ్స్కు అలవాటు పడ్డాడు. దీంతో ర్యాపిడో ద్వార వచ్చే ఆదాయం తన జల్సాలకు సరిపోవడం లేదు. దీంతో మోసాలకు దిగాడు.
ఈనెల 5న తన బైక్పై తార్నాకలోని ఇండియన్ పెట్రోల్ బంక్కు వచ్చిన సబీల్ అందులో పనిచేసే సుమిత్ రాయ్వద్దకు వెళ్లి అర్జంటుగా మిత్రుడికి డబ్బులు పంపాలని, రూ.20వేలు ఆన్లైన్లో పంపిస్తే వెంటనే లిక్విడ్క్యాష్ ఇస్తానని నమ్మించాడు. దీంతో సుమిత్రాయ్ ఫోన్పే ద్వారా అతడు అడిగినంత ట్రాన్స్ఫర్ చేశాడు.
డబ్బులు ఇవ్వకుండా బైక్ను స్టార్ట్చేసి ఉడాయించాడు. సబీల్ను పట్టుకునేందుకు వెంబడించిన సుమిత్ ను తోసేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడు ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంగళవారం హబ్సిగూడలో వాహనాలు చెకింగ్ లో చిక్కిన సబీల్ను అదుపులోకి తీసుకుని విచారించగా అంగీకరించాడు. అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆయన సూచించారు.